8 వార్డులో కారు జోరు
బీఆర్ఏస్ కౌన్సిలర్ అభ్యర్థి బానోత్ శిరీష నరేష్ నాయక్
మరిపెడ మున్సిపాలిటీ 8 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బానోత్ శిరీష నరేష్ నాయక్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇంటి ఇంటికి తిరిగి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించలి అని నిర్వహించిన ప్రచారం లో ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను మున్సిపాలిటీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు,గృహలక్ష్మీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా గంధగోళం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు, బీఆర్ఎస్ హయాంలో పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు,గడిచిన రెండేళ్లలో పట్టణంలో ఏం అభివృద్ధి చేశారు ప్రజలకు తెలిపాలని ప్రశ్నిస్తున్నాను అన్నారు,బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన నిధులు రద్దు చేసిన ఘనత ప్రస్తుత ఎమ్మెల్యేదన్నారు, బీఆర్ఎస్ పార్టీ వేసిన శిలాఫలకాలు ధ్వంసం చేశారన్నారు,వాటి స్థానంలో కొత్తవి పెట్టి మేమే చేశామని గప్పాలు కొడుతున్నారన్నారు,ఈ కార్యక్రమం లో వార్డ్ ఇంచార్జి కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపెల్లి రవి గౌడ్,నారాయణ,కిషన్, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.