వేంసూరు లో బిల్డింగ్ వర్కర్స్ నిరసన
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ భవన నిర్మాణ కార్మికులు బుదవారం నిరసన ప్రదర్శన చేశారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బ్లాక్ డే లో భాగంగా తమ అడ్డా నుండి ప్రధాన రహదారి వరకు నల్లబ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్లు రద్దు చేయాలని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో: తిప్పిశెట్టి సత్యనారాయణ,పండు, సూరిశెట్టి వెంకటేశ్వరరావు,సారంగుల మల్లేశ్వరరావు,బజ్జూరి చెన్నారావు,రంజాన్,నాగులమీరా తదితరులు పాల్గొన్నారు.