

ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ మే20
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్ పల్లి గ్రామ సర్పంచ్ గిన్నారపు లత రామస్వామి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవాభావంతో పనిచేస్తున్నారు. సర్పంచ్గా ఎన్నికైన కొద్ది కాలంలోనే గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సీసీ రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సమస్యల పరిష్కారం, మిషన్ భగీరథ నీటి సరఫరా మెరుగుదల కోసం అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని స్థానికులు అభినందిస్తున్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యల సహకారంతో గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.గ్రామంలోని ప్రతి వాడ, ప్రతి కాలనీ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా అర్హుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.అలాగే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ గిన్నారపు లత రామస్వామి మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు.సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.గ్రామంలో సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్యల పరిష్కారం, మిషన్ భగీరథ నీటి సరఫరా మెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.గ్రామంలోని ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని చెప్పారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యల సహకారంతో గ్రామానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.గ్రామ ప్రజల సహకారంతో మలక్ పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ గిన్నారపు లత రామస్వామి స్పష్టం చేశారు.