
సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్
సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్
కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీలు అనర్హులకు ఇల్లు కేటాయించారని అన్నారు
ప్రధానంగా బిక్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఇండ్ల పంపిణీలో అనర్హులుఉన్నారని అధికారులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ అర్హులకు కేటాయించకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు స్పందించిన కలెక్టర్ గారు హౌసింగ్ జిల్లా అధికారిని వెంటనే రీ ఎంక్వయిరీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఏ విధంగా జరిగిందో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు బిక్నూర్ గ్రామస్తులు అంత ఇండ్లలో ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇళ్ల స్థలాల కోసం ఆందోళన పోరాటాలు కొనసాగించాలని అర్హులకు ఇవ్వకుండా ఇండ్లున్నవారికి ఉద్యోగులకు కేటాయించడం సరైంది కాదన్నారు ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే గారు సైతం అభ్యంతరం తెలిపినట్టు ఆయన గుర్తు చేశారు అర్హులైన పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు. నాయకులు రహిమ హైమ ధి ది ది బేగం పుష్ప లక్ష్మి మంజుల భాష లక్ష్మి నజియా తదితరులు పాల్గొన్నారు