ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం చేసిన సర్పంచ్ అర్వపల్లి
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల
శంభునిగూడెం గ్రామంలో మంగళవారం లబ్ధిదారు సాధనాల మారేష్,ఆదిలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ సర్పంచ్ అర్వపల్లి నరసింహారావు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, బీరాపల్లి సర్పంచ్ జయరాజు, జయలక్ష్మిపురం సర్పంచ్ గడిపర్తి. శ్రీను,ఉపసర్పంచ్ నాగేంద్ర,సీనియర్ నాయకులు అట్లూరి సత్యనారాయణ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,ఇందిరమ్మ కమిటీ, ప్రజలు పాల్గొన్నారు