ఈనామ్ అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్
ఈ69న్యూస్: జనగామ వ్యవసాయ మార్కెట్లో పూర్తి స్థాయిలో ఈనామ్ అమలు చేసి, రైతుల అన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్కు వినతిపత్రం అందజేశారు.రైతు నేత భూక్యా చందు మాట్లాడుతూ,ఈనామ్ అమలులో ఖచ్చితత్వం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని,మార్కెట్ సెస్ పేరుతో అక్రమ వసూలు జరుగుతోందని విమర్శించారు.బాధ్యులపై చర్యలు తీసుకొని,రైతులకు తక్షణమే తక్ పట్టీలు ఇవ్వాలన్నారు.