ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి
దోషులను కఠినంగా శిక్షించాలి
పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు అమానుషంగా చంపడాన్న ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి తీవ్రంగా ఖండించారు, మృతులకి నివాళులర్పించారు, ఉగ్రవాదులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ… జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. మిల్ట్రీ దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చారని కథనాలు వెలువడుతున్నాయని, ఉగ్రవాదుల దాడిని ఆసరాగా చేసుకొని దేశంలో మత విద్వేషాలను సృష్టించే శక్తులు తప్పుడు ప్రచారాలు విస్తృతంగా చేస్తున్నాయి. ఉగ్రదాడులను దేశంలోని ముస్లింలను దోషులుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. గత పది సంవత్సరాలుగా బిజెపి ఉగ్రవాదాన్ని నిర్మూలించామని చెప్పుకుంటున్న గొప్పల డొల్లతనం బయటపడిందని విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడులలో ప్రభుత్వ భద్రతా వైఫల్యాలలకు కేంద్రం బాధ్యత వహించాలని అన్నారు. మొత్తం ఘటనపై సమగ్రమైన విచారణ చేయడం ద్వారా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని అన్నారు. దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో మత విద్వేషం రెచ్చగొడుతున్న మతోన్మాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.