ఉప్పు నాగమణి హనుమంతరావు కౌన్సిలర్ కు ఘన సన్మానం
సత్తుపల్లి పట్టణం ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తుపల్లి 13 వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన ఉప్పు నాగమణి హనుమంతరావు ను సింగరేణి ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు పోగుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఐఎన్టీయూసీ జాయింట్ జనరల్ సెక్రటరీ తీగల క్రాంతి కుమార్ మరియు ఐఎన్టీయూసీ నాయకులు. తీగల క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక శాసనసభ్యులు మట్ట రాగమయి దయానంద్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ సహకారాలతో 13 వ వార్డులో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసి ప్రజాక్షేత్రంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి వార్డు అభివృద్ధిలో , నియోజకవర్గ అభివృద్ధిలో తోడ్పడాలని తెలియజేశారు. అదేవిధంగా వార్డు అభివృద్ధిలో , నియోజకవర్గం అభివృద్ధి లో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణి ఐఎన్టియుసి యూనియన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో షేక్ ఫర్హిన్ బాజీ , మాజీ వార్డ్ కౌన్సిలర్ , కొమ్మేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , ఐఎన్టీయూసీ నాయకులు , కార్యకర్తలు , ఉద్యోగులు పాల్గొన్నారు.