
రేగొండ మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జర్నలిస్టులకు అండగా నిలిచేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమేనని,జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తుందని టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకుడు ఎర్రం సతీష్ కుమార్ అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుకు జీతభత్యాలు లేకుండా 24 గంటలు నిద్రాహారాలు మాని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పనిచేస్తున్నారన్నారు.జర్నలిస్టులతో పాటు వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులు గాలిలో దీపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హులైన జర్నలిస్టుల కు ఆక్రిడియేషన్,అర్హులైన జర్నలిస్టులకు నివేశ స్థలాలను సంబంధించి పాలసీ ప్రకటించి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సమస్యల సాధన కోసం యూనియన్లకు అతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
జర్నలిస్టుల హక్కులు సాధించేవరకు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
యూనియన్ సభ్యత్వ నమోదును పూర్తి చేసుకొని త్వరలోనే జిల్లా మహా సభలు నిర్వహించి నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మండల జర్నలిస్టులకు సభ్యత్వ పత్రాన్ని అందించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా నాయకులు గుజ్జ సరేశ్వర్ రావు,చెరుకు సుధాకర్,ములకల లక్ష్మారెడ్డి, అకుతోట ప్రవీణ్ కుమార్, నాయకులు నామాల రమేష్,పట్టెం కోటిలింగం,అంబాల రవీందర్, బండి కమలాకర్,రహీం పాషా, నామాల రమేష్, సుంకరి శ్రీధర్, మంతెన సురేష్,గన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి, మ్యాదర బోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.