మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు
తెలుగు గళం న్యూస్,పర్వతగిరి, జులై 1
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల కేంద్రంలో గాయత్రీ-హర్ష, రజిత-యాకయ్య దంపతుల కుమార్తె చి.ల.సౌ. కోకిల-చి.రాజు వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు హాజరైన మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు నూతన వధూవరులను ఆశీర్వదించారు.నూతన దంపతులు కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని దీవించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ రావు,మాజీ ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ సునీల్ రావు, మాజీ సర్పంచ్ బొట్ల కిష్టయ్య, ప్యాక్స్ వైస్ చైర్మన్ సందెల నవీన్, మాజీ జడ్పీటీసీ మహ్మద్ సర్వర్, నాయకులు మాసాని యాకూబ్, సింగారపు రమేష్,రంగు జనార్దన్, జూలపెల్లి సురేందర్ రావు,చిన మాధవరావు,మార్కండేయ, బిక్షపతి,వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.