పేదల ఇంటి కల నెరవేర్చడమే రేవంత్ రెడ్డి సర్కారు ధ్యేయం
పేదల ఇంటి కల నెరవేర్చడమే రేవంత్ రెడ్డి సర్కారు ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిదయానంద్ తెలిపారు.బుదవారం వేంసూరు మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో పుచ్చ రమేష్ నాగమణి దంపతులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు ను రాగమయి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించిన చిత్రపటాన్ని ఎమ్మెల్యే బహుకరించారు.ఈ కార్యక్రమంలో:కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ పెద్దగౌల్ల ప్రసన్న ధర్మారావు,సీనియర్ నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డి,ఎర్రా సత్యనారాయణ,అట్లూరి సత్యనారాయణరెడ్డి,పుచ్చకాయల కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.