వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్. నాగరాజ్
తెలుగు గళం న్యూస్/ఫిబ్రవరి 5
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు.
ప్రజల స్పందన, ఇంటింటి ప్రచారంలో వస్తున్న మద్దతు ఇందుకు నిదర్శనం.
ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో
వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్. నాగరాజ్ ప్రజలతో మమేకమై, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను వివరించారు.వర్ధన్నపేట 7వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి భూక్య శ్రీలత
ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో
అయినవోలు మాజీ ఎంపిటిసి బొల్లెపల్లి మధు కూడా పాల్గొని,
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన మద్దతును తెలియజేశారు.