ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామసభలను ప్రజలకు ఉపయోగకరంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.ప్రతి గ్రామంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించడంతో పాటు,గ్రామసభల్లో ఆ జాబితాలను చదివి వినిపించాలని ఆదేశించారు.గ్రామసభల నిర్వహణకు ముందస్తుగా షెడ్యూల్ సిద్ధం చేసి సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయాలని,నిర్ణీత సమయానికి గ్రామసభలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.గ్రామ స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీవో హరికృష్ణ, పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.మొత్తం మీద గ్రామసభల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించడంతో పాటు పారదర్శక పాలనను బలోపేతం చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం అయింది.