రెడ్యా నాయక్ గెలుపు హ్యాట్రిక్ కొట్టాకే తండాలలోఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం
డోర్నకల్ నియోజకవర్గం రెడ్యానాయక్ గెలుపే లక్ష్యంగా కురవి మండలం లో గుండ్రాతి మడుగు పెద్దతండలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం వల్లే ఈ రోజు ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది.
డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమైంది.ఇక్కడ ఓట్లు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది.కేసీఆర్ హయాంలో గ్రామాల రూపురేఖలు మారిపోయి.మా తండాలో మా రాజ్యం అంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
తెలంగాణ రాష్ట్రంలో తండాలనుగ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే.
పోడు భూములకు పట్టాలిచ్చాము, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ ఇచ్చాము. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంట్ పోయి, జీవితాలు ఆగం అవుతాయి.కాంగ్రెస్ జూటా మాటలు, తప్పుడు ప్రచారం చేస్తుంది అన్నారు
కాంగ్రెస్ బిజెపిల మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దు.
కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాక తండాల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇప్పిస్తాము.మన కేసీఆర్, మన బీఆర్ఎస్ను గెలిపించాలి.
లంబాడీలకు ఒక సీసా, పైసలు ఇస్తే ఓటు వేస్తారని కాంగ్రెస్ వాళ్ళు అవమానించారు.
అగౌరవ పరిచిన అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలి.
రెండు ఏళ్ళు కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బంది అయినా సీఎం సంక్షేమ పథకాలు ఆపలేదు.
సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు 3000 రూపాయలు, ప్రతి పౌరుడికి 5 లక్షల ఉచిత బీమా, విడతల వారీగా 5000 వరకు పెన్షన్ పెంపు, 400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు పెంపు వంటి పథకాలను బీఆర్ ఎస్ ప్రభుత్వం అందించబోతుంది.
కాంగ్రెస్ బిజెపి అధికార దాహంతో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి.
ఓటు వేసే ముందు నిత్యం మన కండ్ల ముందు ఉన్న అభివృద్ధిని చూసి ఆలోచించి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలి.
మంచి చేస్తున్న ప్రభుత్వాన్నే మళ్ళీ కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.
డ్రైనేజీలు, సిసి రోడ్ 100% పూర్తి చేసుకుంన్నాము.
గ్రామాలలో మంచినీటి కష్టాలు తొలగించాము, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడపిల్లల వివాహాలకు కేసీఆర్ తోడుగా నిలిచారు.ఎక్కడో ఉండే ఎమ్మెల్యే కాదు, నిత్యం ఇక్కడ ఉండే రెడ్యా నాయక్ ని మరోసారి గెలిపిస్తే మీకు సేవ చేస్తారు.కాంగ్రెస్, బీజేపీ కుట్రలు నమ్మొద్దు.మన ఊరు బలం బలగం ఏంటో 30వ తేది రోజు మనం చూపించాలి.బి ఆర్ ఎస్ అభ్యర్థి డిఎస్ రెడ్యా నాయక్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి.
ఈ ఊరు బిడ్డగా రెండు చేతులు జోడించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ జడ్పిటిసి బండి వెంకటరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామయ్య, పెద్దతండ సర్పంచ్ వనజ శ్రీరామ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మణ్, కిషన్ నాయక్, లాలయ్య,మాధవరెడ్డి రామచంద్రయ్య, రాము నాయక్, పిచ్చి రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, కే ఎన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రాము నాయక్ ఎంపీపీ పద్మ రవి నాయక్ మాజీ ఎంపీపీ రామచంద్రయ్య .గ్రామ సర్పంచ్ ప్రసాద్, ఎంపీటీసీలు మాధవరెడ్డి, అనిల్ రెడ్డి, పట్టాభి రామరాజు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బోడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.