ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
Hyderabadమహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
_ సంయుక్త కిసాన్ మోర్చా అధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్దం
మహిళా రెజ్లర్స్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు మరియు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేశాము.
అనంతరం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కల వెంకటయ్య, ఎ.ఐ.పీ.కే.ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రామచందర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెడుతున్న ఒలింపిక్ పతక విజేతలతో సహా మన అగ్రశ్రేణి క్రీడాకారులు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టడం జరిగిందని అన్నారు.
శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న మల్లయోధులను రోడ్ల పై ఈడ్చుకుంటూ అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు “బేటీ బచావో బేటీ పడావో” అంటూ సంబరాలు చేసుకుంటూనే, మరోవైపు ఈ దారుణమైన నేరంలో నిందితుడైన బీజేపీ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. మన భవిష్యత్ అథ్లెట్లు వారి కలలను సాకారం చేసుకోవడానికి ఇలాంటి ఘటనలు కారణం కాకూడదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.ఎల్ పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. హన్మేశ్, పి.వై.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, పి.ఓ.డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆర్ రాహుల్, ఇఫ్టు, POW, PYL నాయకులు కిరణ్, లింగం గౌడ్, రవీందర్, రవి కుమార్, వరలక్ష్మి, దేవమని, పుష్ప, నాగమ్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.