•ఇళ్ల స్థలాలపై ఉన్న సాంకేతిక
సమస్యను పరిష్కరిస్తాం
•హెల్త్ కార్డుల పై దృష్టి సారిస్తం
•జర్నలిస్టుల అక్రిడియేషన్
సమస్యల పరిష్కారానికి కృషి
చేస్తాం
•జర్నలిస్టులు పరిశోధనాత్మక
వార్తలపై దృష్టి సారించాలి
•రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి
దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడి



ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం వెనుకాడబోదని జర్నలిస్టుల ఇండ్ల ,హెల్త్ కార్డుల,అక్రిడియేషన్,సమస్యలపై నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.బుధవారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఇల్లందు క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) 3వ మహాసభ సీనియర్ జర్నలిస్టు,టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ,ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిజం సమాజంలో గౌరవప్రదమైన వృత్తి అని,ప్రజాస్వామానికి నాలుగో స్తంభంగా జర్నలిజం పిలువ పడుతుందని అన్నారు.స్వాతంత్ర పోరాటంలో గాంధీ లాంటివారు పత్రికలు స్థాపించి జర్నలిజం ద్వారా ప్రజలలో మార్పు తీసుకువచ్చారని,అలాంటి ప్రతిష్టాత్మకమైన వృత్తిలో జర్నలిజం సమాజాన్ని మేలుకొలపాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుందని, జర్నలిస్టులు టెక్నాలజీని ఒక విప్లవమైన శక్తిగా మార్చాలని ఆలోచనతో ఉన్నప్పటికీ పెన్ను విలువ ఎప్పటికీ తగ్గదని వెల్లడించారు.అసలు సిసలైన వార్తలు రాసి జర్నలిస్టులు సమాజం లోని రుగ్మతలను రూపుమాపాలని, ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలవాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులు పరిశోధనాత్మక వార్తలు రాసి శాస్త్రీయమైన సాంకేతికని జోడించి ప్రజలకు మేలు చేకూర్చేలా చూడాలని సూచించారు.జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే ఒక పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఎలా అధిగమించాలని విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత ప్రభుత్వం దృష్టి సారించిందని చాలామంది జర్నలిస్టులకు ఆరోగ్యపైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.కొంతమంది సొంత కథనాలు రాయలేదని మీడియాపై అక్కసును ఖండిస్తున్నానని వెల్లడించారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనానికి అవసరమైన నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్టు లకు అవసరమైన ఇండ్ల స్థలాల కేటాయింపుపై ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.జర్నలిస్టులు సమాచారం సేకరించడంలో,నివేదించడంలో,న్యాయంగా,ధైర్యంగా ఉండాలన్నారు.నిరంతరం సత్యాన్ని అన్వేషించాలని ఎమ్మెల్యే జర్నలిస్టులకు సూచించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపునయ్య మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో మెడిక్లెం హెల్త్ పాలసీ తో మెరుగైన వైద్య సేవలు అందెవని తెలిపారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెల్త్ కార్డుల వలన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. ఉద్యోగుల మాదిరిగా కొత్త హెల్త్ స్కీమును జర్నలిస్టులకు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు.ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణాలు పై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.దేశంలో 16 రాష్ట్రాలలో జర్నలిస్టులకు వృద్ధాప్య పెన్షన్ స్కీమ్ అమల్లో ఉందని,మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు,తెలంగాణ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్,తాటికొండ కృష్ణ,రాష్ట్ర కార్యదర్శిలు చంద్రశేఖర్,రఘు,బిక్షపతి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ తో పాటు జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక…
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్ల్ జె ఎఫ్) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఇల్లంద క్లబ్ హౌస్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా 3వ మహా మహాసభలలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు.జిల్లా అధ్యక్షులుగా ఎర్రం సతీష్ కుమార్,కార్యదర్శిగా గుజ్జ సారేశ్వర్,కోశాధికారిగా మండల రాంబాబు తో పాటు,ఉపాధ్యక్షులు ములకల లక్ష్మారెడ్డి,కొండ్ర రమేష్,జాయింట్ సెక్రటరీలుగా టి. దుర్గయ్య,సామల ధనుంజయ,సుంకరి శ్రీధర్,స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా చింతల కుమార్ యాదవ్,జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కొలుగూరి సంజీవరావు లతో పాటు జిల్లా కమిటీ సభ్యులుగా ఎండి రహీం, నామాల రమేష్,కాట్రేవుల లచ్చయ్య,అంగడి గణపతి తదితరులు ఎన్నికయ్యారు.
తెలంగాణ బ్రాడ్ క్యాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నిక
తెలంగాణ బ్రాడ్ క్యాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీబీజేఎ)జిల్లా అధ్యక్షులుగా ఆకుతోట ప్రవీణ్ కుమార్,కార్యదర్శిగా బండి కమలాకర్,జిల్లా ఉపాధ్యక్షులుగా బొంగోని తిరుపతి,కోశాధికారిగా ఏనుగుల భాస్కర్,స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా రొంటాల శంకర్ లతో పాటు జిల్లా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.