ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంతకల్ డియస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో పామిడి ఇంచార్జ్ సీఐ చాంద్ భాషా, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది కలసి పామిడి పట్టణంలోని BCC రోడ్డు, ఎద్దులపల్లి సర్కిల్ మరియు ఆర్టీసీ బస్టాండ్ వరకు విజిబుల్ పోలీసింగ్ చేస్తూ రోడ్డు కు ఇరుప్రక్కల ఉన్న ఫుట్ పాత్ ల పై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలు, షాపులు ముందు ఉంచిన వస్తువులు క్లియర్ చేయిస్తూ, షాపు యజమానులకు ట్రాఫిక్ సూచనలు తెలియచేయడమైనది.అంతేకాకుండా ఇక నుంచి పట్టణంలో కచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు రూల్స్ పాటించాలి అని తెలిపారు.మైనర్ పిల్లలుకు నడపడానికి వాహనాలు ఇవ్వరాదు. అలా ఇచ్చిన వాహన యజమానులు పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది.సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, త్రిబుల్ రైడింగ్ లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు.ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలి, ఆటో సీరియల్ నంబర్ కలిగి ఉండాలి.ఈ కార్యక్రమంలో పామిడి టౌన్ ఇంచార్జ్ సీఐ చాంద్ భాషా, ఏయస్సై వలీ స్పెషల్ పార్టీ సిబ్బంది మరియ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.