నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఎం పార్టీనిత్యం ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఎం పార్టీ

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం పార్టీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపాలని ఇంటింటి ప్రచారం చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి M. దశరథ్. బాగ్లింగంపల్లిలో వివిధ lig కాలిని,EWS క్వార్ట్స్, ఆచయ్య నగర్, బస్తీల లో ఇంటి ఇంటికి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ, ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ప్రజలను ఓట్లు అడగడం జరిగింది. గెలిచే వాళ్ళ కాదు ప్రజా సమస్యలపై పోరాడే వారికి ఓట్లు వేయాలని భాగలింగంపల్లి అనేక సమస్యలపై సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని విఎస్టి రోడ్ వైడింగ్ గాని ఈ డబ్ల్యూ క్వార్టర్స్, పాలమూరు బస్తి అచ్చయ్య నగర్ బస్తీలలో లో మురికినీటి సరఫరాను అడ్డుకొని వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడం జరిగిందని, వీధిలైట్లు సమస్య పరిష్కారం చేయడం జరిగిందని అనేక సమస్యలపై పోరాడిన సిపిఎం పార్టీ ఆదరించాలని మహిళా సంఘాలకు పొదుపు గ్రూపు వేసి వారందరికీ లోన్లు వచ్చే విధంగా ఇప్పటికి ఒక్కొక్క గ్రూప్ కు ఐదు, ఆరుసార్లు లోన్లు తీసుకున్న దాఖలాలు ఉన్నాయని ఒక్కో గ్రూప్ ఇప్పటికీ 10, 20, లక్షల వరకు లబ్ధి పొందాయని, అది సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా సాధ్యమైందని గుర్తు చేశారు. అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని ఐదేళ్లకోసారి ఎలక్షన్లప్పుడు కనబడడం తప్ప ఇంతవరకు వాళ్ళు నియోజకవర్గానికి డివిజన్ కు చేసిన మంచి పని ఏ ఒక్కటి లేదని బాగ్ లింగంపల్లి హౌసింగ్ బోర్డ్ లాండ్స్ కబ్జా కాకుండా అడ్డుకొని వాటి పరిష్కరించిందని సిపిఎం పార్టీ అని, ఇలా అనేక సమస్యలు పరిష్కారం చేసిన సిపిఎం పార్టీని ప్రజలందరూ ఆదరించాలని సిపిఎం పార్టీని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జి రాములు, కే రమేష్, డి సైదులు, ఆర్ వెంకటమ్మ, చెన్నయ్య, లక్ష్మి ,వెంకన్న, నరేందర్ ,వీరయ్య, వీరేష్ రాము తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News