ఖమ్మంజిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఏసీపీ రామానుజన్,సి.ఏ.పి.ఎఫ్ కమాండెంట్ సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో పార మిలిటరీ బలగాలు గురువారం రాత్రి మండలం పరిధిలోని కుర్నవల్లి,కలకూడిమ గ్రామాలలో ప్రత్యేక కవాతు నిర్వహించారు.ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని,ప్రతిఒక్కరు ఓటు వేసేందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు కవాతును ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట తల్లాడ ఎ.స్సై. పి.సురేష్,కానిస్టేబుల్ బాలాజీ, కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు