వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నగరంలో భూ కబ్జాలు, బెల్ట్ షాపులు, గుట్కా గంజాయి మయమైందని అభివృద్ధి మాత్రం శూన్య మేనని 31 డివిజన్ న్యూ శాయంపేట లో జరిగిన ప్రజాదీవెన యాత్రలో నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజాదీవెన యాత్ర ఈ రోజు హన్మకొండ 31 వ డివిజన్ లో కాకతీయ హిల్స్ నుండి ప్రారంభమై పద్మాక్షి వాడ, చాకలివాడ, ఎస్.సి. కాలని హరిజనవాడ, కాపువాడ మీదుగా సాగి గాంధి విగ్రహం వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించింది కాంగ్రెస్ పార్టీ..
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మానవుల నడ్డి విరుస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చౌక ధరల దుకాణంలో 11 రకాల సరుకులు ఇచ్చినం. నేడు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఒక బియ్యం మాత్రమె ఇచ్చి మోసం చేసింది.
దారిద్ర్య రేఖువకు దిగువగా ఉన్న పేద ప్రజలకు ఉచితంగా రేషన్ కార్డులు ఇచ్చి ఆదుకుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం.
విద్యార్థులకు ఫీజ్ రీ ఇమ్బర్స్మెంట్ ప్రవేశపెట్టి ఉన్నత చదువులు చదువుకోవటానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చి ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం
రెండు సార్లు అధికారంలో ఉండి కూడా పేద ప్రజలకు ఇంతవరకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు ఎం.ఎల్.ఏ. వినయ్ భాస్కర్.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో సంవత్సరానికి 100 చొప్పున 57 ఏళ్ళు దాటినా వారికీ కొత్త పెన్షన్లు ఇస్తానని చెప్పినారు ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు.
అర్హత ఉన్న వారికి కూడా వృద్దాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్ లు రాలేదు
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది. ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏం ఏం చేస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి.
తెలంగాణా ఉద్యమకులు, మేధావులు, విద్యార్థులు కలిసి కట్టుగా ఉండి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కే.సి.ఆర్ ను గద్దె దించేందుకు సిద్ధం కావలి.
ఆ శక్తి మీ దగ్గర ఉంది మీ ఓటే మీ ఆయుధం
కాబట్టి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి సంజయ్ జాగీర్దార్, డివిజన్ అద్యక్షుడు అన్కేశ్వరపు సురేందర్, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రాజాలి, మాజీ కార్పొరేటర్ ఏ. నాగరాజు, మాజీ అద్యక్షుడు సత్తు రమేష్, బండారి మురళి, కే. కృష్ణ, వేల్దండి రమేష్, గండ్రాతి యాదగిరి,ముక్క వేణు, పిండి రమేష్,వేల్పుల రమేష్, వేల్పుల మల్లయ్య, సత్తు శ్రీధర్, ఏ. రమణ కుమారి, కే.వసంత, బోల్లెన సురేందర్, సత్తు రాజేష్, బొల్లన రామదాస్ తదితరులు పాల్గొన్నారు .