ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం సిపిఎం
సిపిఎం సత్తుపల్లి డివిజన్ కమిటీ సమావేశం జాజిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ
సమస్యల పైన ప్రజల పక్షాన నికరంగా పోరాటం నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించాలని అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి కల్లూరు లో పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు ఇండ్లు ఇండ్ల స్థలాలు జనగామ పట్టణ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలని
పట్టణంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని అలాగే పట్టణ సుందరీ కరణ జరగాలని సత్తుపల్లి ఏర్పడినప్పటి నుండి స్థాయి అభివృద్ధి పెద్దగా జరగలేదని పట్టణం అభివృద్ధి అయితేనే సత్తుపల్లి అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటదని అందుకోసం ప్రజా సమస్యల పైన పట్టణ సమస్యల పైన ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న సిపిఎం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే సత్తుపల్లి కల్లూరు పట్టణం మరింత ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు కులం మున్సిపల్ కౌన్సిల్ పంపితే అభివృద్ధి చెందుతుందని కౌన్సిలర్లు అనేక సందర్భాల్లో మున్సిపల్ వేదికగా ప్రజా సమస్యల్ని గొంతెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేసిన చరిత్ర సిపిఎం కు ఉన్నదని వివరించారు సిపిఎం మాట్లాడుతూ నీతి నిజాయితీగా విలువలకు కట్టుబడి పని చేసే సిపిఎం పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రజలు ఆదరించి పట్టణంలో అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చలమాల విఠల్రావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు కొలిక పోగు సర్వేశ్వరరావు, అయినాల రామలింగేశ్వర రావు, తన్నీరు కృష్ణార్జున రావు, మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, సిపిఎం మండల కార్యదర్శి పెనుబల్లి గాయం తిరుపతిరావు కల్లూరు మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరావు, వేంసూర్ మండల కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్రావు, డివిజన్ కమిటీ సభ్యులు, నల్లబోతు మోహన్ రావు, పాకలపాటి ఝాన్సీ, శీలం కరణ,మిట్టపల్లి నాగమణి, దోమ తొట్టి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.