
బొల్లె బిక్షపతిని పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న మాజీ జడ్పిటిసి బొల్లె బిక్షపతిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోరారు.బిక్షపతి కుటుంబానికి అండగా ఉంటామని చల్లా ధర్మారెడ్డి తెలిపారు.వారి వెంట పరామర్శించిన వారిలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.