తేదీ: 01.03.2023 ,
తమ్మడపల్లి(జి).
తమ్మడపల్లి(జి) మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ: 32.88 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మౌళిక వసతుల అభివృద్ధి పనులను ప్రారంభించిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే మన ఊరు మనబడి కార్యక్రమ లక్ష్యం…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఈరోజు…జాఫర్గడ్ మండలం , తమ్మడపల్లి(జి) గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యాశాఖ ద్వారా
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో మన ఊరు-మన బడి నిధులు(MOMB) మరియు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి రూ: 32.88 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మౌళిక వసతుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని తమ్మడపల్లి(జి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన తరగతి గదుల మేజర్ మరియు మైనర్ రిపేర్లను, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్ , గ్రీన్ బోర్డులు మరియు టాయిలెట్స్ నిర్మాణాలను ఎమ్మెల్యే డా.రాజయ్య గారు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డా.రాజయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఉధ్యేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…ఆచార్యదేవో భవ అంటే గురువు దేవుడితో సమానం.Education is Important to Among all(ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ టు ఏమాంగు ఆల్) అంటే విద్యా వజ్రాయుధం లాంటిదని ,చదువు సకల సమస్యలకు పరిష్కారమని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో 1001 రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి ఒక్కో విద్యార్థి మీద 1.20 లక్షల ఖర్చు చేస్తూ విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచిత ఆంగ్లవిద్య అందిస్తున్నారని తెలిపారు
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు-మన బడి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాదాపు రూ. 7300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్న 26065 ప్రభుత్వ పాఠశాలలను 12 అంశాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9123 పాఠశాలలకు రూ:3497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.మొదటి దశలో విద్యార్థుల నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోవడం జరిగిందని తెలిపారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు సెలెక్ట్ కావడం జరిగిందని తెలిపారు.మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను ఈ రోజు తమ్మడపల్లి(జి) గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ: 26.36 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మౌళిక వసతుల అభివృద్ధి పనులను ఒక పండుగ వాతావరణంలో లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సర్కార్ బడులకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు అని ఎమ్మెల్యే గారు తెలిపారు అంటే 12 అంశాలలో ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా సమగ్ర అభివృద్ధి చేయనున్నారని తెలిపారు మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి అని తెలిపారు.
సర్కార్ బడులు సమూలంగా మార్పు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం తీసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన తోపాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు.దీంతో విద్య కోసం వలసలు తగ్గుతాయి ముఖ్యంగా బాలికల డ్రాపౌట్స్ తగ్గుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవ్వడానికి అదేవిధంగా అన్ని రకాల మౌళిక వసతుల కల్పనకు అవకాశం ఉందని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని , నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కావున ప్రభుత్వ పాఠశాలల్లో సమూలంగా సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి చేయడానికి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి నాకు వచ్చిన ఐదు కోట్ల రూపాయలలో రెండున్నర కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి అదేవిధంగా మరో రెండున్నర కోట్లు నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియోజకవర్గ BRS పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు గారు, అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు , సంబంధిత శాఖల అధికారులు-ఉద్యోగులు , మహిళ నాయకులు , గ్రామప్రజలు , ఉపాధ్యాయులు , విద్యార్థులు , విద్యార్థుల తల్లిదండ్రులు మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…