
యువత చరిత్ర తెలుసు కోవాలని శ్రీ జంగా రాఘవ రెడ్డి గారు అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటం… ఆ తర్వాత నేటి ఆధునిక భారతావని ప్రస్థానం ఎలా సాగిందన్నదానిపై నేటి తరం తెలుసుకోవాలని కోరారు. దానికి ఈ నెల 18న నిర్వహిస్తోన్న రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ మంచి ఈవెంట్ గా అభివర్ణించారు. 16 నుండి 35 సంవత్సరాల యువత దీనిలో పాల్గొన వచ్చని తెలిపారు. క్విజ్ లో పాల్గొనదలచిన వాళ్లు 7661899899 కు ఈ నెల 17 వరకు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు. రిఫరల్ కోడ్ లో JANGA RAGHAVA REDDY అని టైప్ చేయాలని కోరారు.
క్విజ్ లో విజేతలకు మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ల్యాప్ టాప్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, మరిన్ని కన్సోలేషన్ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.