రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
Mulugu
రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి
పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది
ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయాలి
ఆర్డీవో గారికి వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు జిల్లా అధ్యక్షులు నల్లెల సూచన మేరకు భూమి, వ్యవసాయం,
రైతుల కష్టాలు, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ములుగు ఆర్డీవో కు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్రం లో రైతుల పడుతున్న కష్టాలు అంత ఇంత కాదని ధరణి పోర్టల్ తెచ్చి రైతులను మోసం చేస్తున్నారని
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు
సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు.
వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి.కానీ ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోంది భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది.
ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి కుచన రవళి రెడ్డి, టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ మామిడి శెట్టి కోటి
కాంగ్రెస్ పార్టీ ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్య నారాయణ,చిట మట రఘు
జాలపు అనంత రెడ్డి,ఎండీ అఫ్సర్, వజ్జ సారయ్య,జాడి వెంకటేశ్వర్లు,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,బండి శ్రీనివాస్,రసు పుత్ సీతారాం నాయక్,జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ
తాడ్వాయి మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ముదర కోళ్ల తిరుపతి,ఎంపీపీ విజయ రూపు సింగ్,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు సర్పంచులు, ఎంపీటీసీలు,
గ్రామ కమిటీ అధ్యక్షులు జిల్లా మండల గ్రామ సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు మహిళా కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు