
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.వారి చిత్రపటానికి పూలమాలలు వేసి,నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ నిజమైన ప్రజా నాయకుడు,ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు అని అన్నారు.తెలంగాణ సాధనలో బాపూజీ గారి పాత్ర అపూర్వమని గుర్తుచేశారు,వారి జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.