కందుకూరు లో 31 న ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ
ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో ఈ నెల 31 న ఉదయం 9;30 గంటలకు వీర తెలంగాణ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ చేయనున్నట్లు మండల రజక సంఘం అధ్యక్షులు తాళ్లూరి రామారావు మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.ఆవిష్కరణ కార్యక్రమంలో రజకులు,ప్రజాసంఘాల నేతలు,సామాజిక వాదులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని తాళ్లూరి పిలునిచ్చారు.ప్రకటన విడుదల చేసిన వారిలో తాళ్లూరి వెంకట కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.