కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుండి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు.ఆదివారం హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని కలిసి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుండి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కి వినతిపత్రం అందజేశారు. కోదాడ మున్సిపాలిటీ అభివృద్ధికి,కోదాడ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి నియోజకవర్గంలోని పలు పంచాయతీరాజ్,ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తెలిపారు.అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.