మృతుల కుటుంబాలను పరామర్శించిన సీతక్క
కోతకు గురై తెగిన మారేడు గుండ చెరువును పరిశీలించి వరుద లో కొట్టుకు పోయి మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించి 10 వేల ఆర్థిక సాయం 50 కేజీ ల బియ్యం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు వేంకటా పూర్ మండలం లోని లక్ష్మీదేవిపేట భూర్గు పేట మధ్యలో ఉన్న మారేడు గుండ చెరువు గత నాలుగు రోజుల క్రితం గండి పడి తెగడం తో భుర్గు పేట గ్రామానికి చెందిన బండసారయ్య,సారమ్మ,రాజమ్మ లు వాగులో కొట్టుకు పోయి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి 10 వేల ఆర్థిక సాయం 50 కేజీ ల బియ్యం అందించి ముంపుకు గురైన 32 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
గత నాలుగు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిన్న రాత్రి కోతకు గురైన మారేడు గుండ చెరువు తెగి మరణించిన కుటుంబాలకు రాష్ట్రం ప్రభుత్వం 25 లక్షల నష్ట పరిహారం తో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు మారేడు గుండ తెగిపోవడం తో రైతులకు తీవ్రనష్ట జరిగిందని అధికారులు వేను వెంటనే చెరువు మరమ్మతు పనులు మరియు రాక పోకలకు అంతరాయం కలగకుండా రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని
ముంపుకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా,
బ్లాక్,మండల,గ్రామ నాయకులు అనుబంధ సంఘాల జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు