అంకమ్మ తిరునాళ్ల మహోత్సవానికి రండి
దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను బేతుపల్లి దేవస్థాన కమిటి సభ్యులు కలిశారు.తుమ్మల చేతులమీదుగా బేతుపల్లి అంకమ్మ తిరునాళ్ల మహోత్సవ బ్రోచర్లను కమిటీ సభ్యులు శనివారం ఆవిష్కరింపచేశారు.ఏప్రియల్ 3,4 తేదీలలో అత్యంత వైభవంగా జరిగే అంకమ్మ తిరునాళ్ల మహోత్సవానికి రావాలని తుమ్మలను ఆలయ కమిటీ సభ్యులు కోరారు. మంత్రి తుమ్మలను కలిసిన వారిలో చల్లగుళ్ళ. లోకేశ్వరరావు, అజయ్ బాబు, రాము తో పాటు ఆలయ కమిటీ సభ్యులు బేతుపల్లి గ్రామ పెద్దలు ఉన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని బేతపల్లి గ్రామంలో ఈ అంకమ్మ తిరుణాల మహోత్సవం గ్రామ పెద్దలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు