గ్రామ సభలో సమస్యపై చర్చ
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల లింగపాలెం గ్రామంలో ఇటీవల 99 రోజుల ప్రణాళిక అమలు తీరులో భాగంగా జరిగిన గ్రామ సభలో గ్రామ సర్పంచ్ ఎర్ర రమేష్,రైతులు ఎన్టీఆర్ కెనాల్ నుండి లింగపాలెం పెద్దచెరువు కి వెళ్లే తూము కాలువ పిచికాడతో అగుపించకుండా పూడుకు పోయిందని అధికారులకు విన్నవించారు.గ్రామ సభలో విన్నవించిన సమస్యపై ఐబీ ఏఈ వెంకటరమణ స్పందించారు.శుక్రవారం జేసీబీ యంత్ర సహాయంతో ఆ కాలువను జొన్నాదుల పుల్లారావు ఇంటి దగ్గర నుండి వైకుంఠదామం వరకు ఐబీ వారి సహకారంతో పిచ్చి కాడ పూడిక తీయించటం ప్రారంభం చేశారు.సర్పంచ్ ఎర్ర రమేష్ అట్టి పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Nice coverage medam garu.