ఘనంగా చలమాల వర్ధంతి
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని
పెనుబల్లి మండల కేంద్రంలోని వి ఎం బంజర్ లో చలమల గంగాధర్ వర్ధంతి శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా గంగాధర్ స్తూపం వద్ద సిపిఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి జెండాని ఆవిష్కరించి నివాళులర్పించారు. గంగాధర్ చిత్రపటానికి వీఎం బంజర సర్పంచ్ భూక్య ప్రసాద్ పూలమాల వేశారు. మండల కార్యదర్శి గాయం తిరపతి రావు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో శీలం మాట్లాడుతూ పేదలకు ఇస్తున్న పథకాలపై మరిన్ని రాయితీలు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు నిరంతర పోరాటం చేయడం ద్వారానే ఉపాధి హామీ చట్టం అటవీ హక్కుల చట్టం వంటి ప్రజాహిత కార్యక్రమాలను విజయవంతం చేయగలిగామన్నారు. సాధించిన హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం కాల రాస్తుందని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు మేధావులు ప్రజాసంఘాలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో: జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు, విఎం బంజర్ ఉపసర్పంచ్ తాళ్లూరు రవి నాయకులు చిట్టి మోదుల కృష్ణయ్య, చెమట విశ్వనాథం, కండే సత్యం, మిట్టపల్లినాగమణి,చలమాల నరసింహారావు, మేకల బాజీ, కలకోట వెంకటేశ్వర్లు,వడ్డేపల్లి రవీంద్ర,దండే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు