ప్రజలకు అందుబాటులో తేస్తారా ఇకనైనా ????
- –_ శ్రీమతి గుగులోత్_ పార్వతి రమేష్ నాయక్ ???? జిల్లా మహిళా కన్వీనర్/ డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జీ మరిపెడ బంగ్లా : స్థానిక మరిపెడ అసెంబ్లీ కేంద్రం(క్యాంపు కార్యాలయం ముందు)లో గుగులోత్ నితిన్ అధ్యక్షతన జరిగిన గత వారం,పది రోజులుగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాలంలోనైనా క్యాంపు కార్యాలయం(2023-2027) ప్రారంభించి జాటోత్ రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యల్ని పరిష్కరించడం ఉత్తమమని డిమాండ్ చేశారు. ఉత్సవ విగ్రహాలను తలపిస్తున్న ఎమ్మెల్యే కార్యాలయం పేదలకు, రైతులకు, కార్మికులకు ప్రజల సాధక భాధలను తెలుసుకోవాలి అని ఉద్దేశించి నిర్మిస్తే ధరంసోత్ రెడ్డి నాయక్ గారు మీనమేషాలు లెక్కించడం తప్ప ప్రారంభించలేదు కాబట్టి ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోబెట్టారని ఇకనైనా నిజమైన కార్యకర్తలను, తెలంగాణ ఉద్యమ కారులను, బిసి ఎస్సీ ఎస్టీ మతమైనారిటీ లను,అర్హత ఉన్న ప్రజలను గుర్తించి పేదలకు పార్టీలకు, రాజకీయాలకు, లింగభేదం తేడా లేకుండా స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం ఉండేలా సంత్ సేవలాల్ మహారాజ్ ఫూలే అంబేద్కర్ సామాజిక పరివర్తన ధ్యేయంగా పరిపాలన చేయాలని కోరారు.. ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశించి చేసే పనులలో భాగస్వామ్యం ఉంటుంది అని డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలను గౌరవిస్తామని,ప్రజా వ్యతిరేక విధానాలను ఎండా గడతామని చెప్పారు..
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఇసి మెంబర్ శ్రీను నాయక్ ఎడ్లరెడ్డి పాల్గొన్నారు