బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ రాజయ్య నివాళి

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్:భారత గొప్ప దళిత నాయకుడు,స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ..జగజ్జీవన్ రామ్ జీవితమే ఓ పాఠశాల,ఆయన సామాజిక న్యాయం కోసం చేసిన కృషి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.దేశ ఉపప్రధానిగా,రక్షణ మంత్రిగా,వ్యవసాయ రంగంలో సంస్కరణలకు నాంది పలికిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *