రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆ సంఘం ఖమ్మంజిల్లా తృతీయ మహాసభలు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపం,సామినేని రామారావు నగర్‌లోని కాసాని ఐలయ్య ప్రాంగణంలో త్వరలో జరగనున్నoదున ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు లు ప్రసంగించారు.వారు మాట్లాడుతూ జిల్లాలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భూభారతి పోర్టల్ లో లోపాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూమి కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు సీతారామ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి, రూ. 9 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు మరమ్మతులు చేపట్టి, రైతులకు నీటి అందుబాటు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు రకాల పంటలకు బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులను గుర్తించి 2011 సాగుదారు చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు జారీ చేసి, బ్యాంకు రుణాలు, పంట అమ్మకాలు, ఎరువుల సబ్సిడీలలో వాటిని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విత్తన చట్టం, విద్యుత్ సంస్థల మార్కెట్ ముసాయిదా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి, నల్లమోతు మోహన్ రావు, కళ్యాణపు కృష్ణయ్య, గుంటుపల్లి వెంకటయ్య, సత్తెనపల్లి నరేష్, షేక్ మస్తాన్, గండమల ఆనందరావు, పెరసాని వెంకటయ్య, పులి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతు సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలి

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆ సంఘం ఖమ్మంజిల్లా తృతీయ మహాసభలు సత్తుపల్లి…

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్

సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం గ్రామ పంచాయతీ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు బాబు) తన జన్మదినాన్ని పురస్కరించుకొని రిబ్బన్…

ssc results
ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఘన సన్మానం

ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు…

మేడిగడ్డ–కాళేశ్వరం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ–కాళేశ్వరం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మేడిగడ్డ,కాళేశ్వరం ప్రాంతాలను సందర్శించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు

గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు

అక్రమ గుడుంబా తయారీని అరికట్టేందుకు రేగొండ ఎస్సై డి.సుధాకర్ కఠిన చర్యలు చేపడుతున్నారు.ఆయన ఆధ్వర్యంలో దమ్మన్నపేట గ్రామంలో పక్కా సమాచారంతో నిర్వహించిన మెరుపు దాడుల్లో అక్రమ గుడుంబా…

కుల వివక్ష నిర్మూలన దిశగా కేవీపీస్ కృషి

కుల వివక్ష నిర్మూలన దిశగా కేవీపీస్ కృషి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం పంకెన గ్రామానికి చెందిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీస్) జిల్లా నాయకులు పలిమేల పోలీస్ స్టేషన్ ఎస్సై…

ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు ముందడుగు

ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు ముందడుగు

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విధుల్లో నిత్యం ఎండలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో…

తెలంగాణ ఏర్పాటుపై బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా న్యాయం చేశాయి

తెలంగాణ ఏర్పాటుపై బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా న్యాయం చేశాయి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా ఆరోజు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందా. కాంగ్రెస్…