నిరుపేద దళితులకు గృహ అవసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున కోరారు. ఈరోజు దొడ్డి కొమరయ్య భవనంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 342 జీవో ప్రకారంగా 100 యూనిట్ల విద్యుత్తు ఇవ్వాలని ఉన్నప్పటికీ అమలు కావడం లేదని సబ్సిడీలు వేయడం లేదని అన్నారు. ప్రతి అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు కొరకై ఈనెల ఐదు నుండి 24 తేదీ వరకు సర్వేలు నిర్వహించి 25 న కరెంటు Ae ఆఫీస్ ల ముందు ధర్నాలు నిర్వహించి దరఖాస్తులు పెట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీన జిల్లా ఎస్ఇ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. భూస్వాములకు పెట్టుబడిదారులకు కార్పోరేట్ ఉద్యోగస్తులకు భూములు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్యుత్తు మోటార్లకు కరెంటు ఇస్తున్నప్పుడు దళితుల గృహాలకు సెంటు భూమిలేని పేదలకు ఉచితంగా గృహాలకు కరెంటు ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఉచిత విద్యుత్తు అమలు చేయాలని కోరారు. ఈనెల 9న హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గృహాలకు ఉచిత విద్యుత్తు పై సదస్సు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈనెల 15న సోషల్ వెల్ఫేర్ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేమీడాల పరుష రాములు జిట్టా నగేష్ జిల్లా ఆఫీసు బేరర్స్ గాదే నరసింహ బొల్లు రవీందర్ పెరికే విజయ్ కుమార్ కోడి రెక్క మల్లన్న జిల్లా కమిటీ సభ్యులు దంతాల నాగార్జున తక్కెళ్ళపల్లి శ్యామ్ అంజి బాబు చిట్యాల రాజు నల్ల రామస్వామి మేడి వెంకటయ్య పర్వతం శివలింగం పులిజాల వెంకటయ్య మండల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు..