
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కోదాడ పట్టణం, కోదాడ, చిలుకూరు, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతే మండలాలకు చెందిన 137మంది లబ్ధిదారులకు రూ.60.67లక్షల సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును బాధితులకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను పొందేందుకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని కొనియాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీ లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఆయా మండలాల సమన్వయ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.