ఈరోజు బేల మండలంలోని సైదుపూర్ సాంగ్వి, పాట గూడా గిరిజన గ్రామాల్లో
జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు
ఈరోజు బేల మండలంలోని పలు గ్రామాల్లో నాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయే తప్ప ఈ బంగారు తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించడం లేదు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లు తప్పా
నాడు గిరిజనులకు అటవీ హక్కు చట్టం తీసుకువచ్చి వారు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు అటవీ హక్కుపత్రాలు ఇచ్చి గిరిజన రైతులను ఈ ప్రపంచంలో సగర్వంగా బ్రతికే విధంగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అయ్యా ఎమ్మెల్యే జోగు రామన్న మీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏమిటి..?
ఒక్క గిరిజన రైతు కైనా ఒక్క ఎకరానికి అటవీ హక్కు పాత్రలు ఇచ్చిండ్రా..?ఎవరికైనా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా..? ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి మిషన్ భగీరథ నీరు ఇంటింటికి ఇచ్చారా…?
అలాగే అర్హులైన రైతులందరికీ ఒక్క లక్ష రూపాయల రుణమాఫీ చేశారా…? ఏం చేశారని చెప్పేసి మీరు ఈ వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని చెప్పి అడుగుతారో..? సమాధానం చెప్పాలని డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్
ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు