మన భారత ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేవాదులు మతోన్మాదులు ఫాసిస్టులు క్విట్ ఇండియా కావాలని రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్ KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. ఆగస్టు 8 క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య ఫోరం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో మణిపూర్ హర్యానా ఢిల్లీ లాంటి ప్రాంతాలకు ఫాసిస్ట్ ఉన్మాదుల చర్యల వలన ప్రజలపై దాడులు పెరిగాయని మహిళలు వృద్ధులు పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని మనిషిని మనిషిని గౌరవించని ఈ ఉన్మాదము దేనికని ప్రశ్నించారు. మనుషులంతా సమానమని అన్ని మతాలు కులాలు, సాంప్రదాయాలు సంస్కృతులు లౌకికవాదం భారతదేశ భిన్న సంస్కృతలకు నిలయమని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో మనుషులను చంపడం ఘోరమైన నేరమని దాడులకు పాల్పడే వారిని ఈ ప్రజలు బహిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాస్ జిల్లా నాయకులు ఒంటెపాకా యాదగిరి నాయకులు నలపరాజు సైదులు అద్దంకి నరసింహ ఇస్తారు తదితరులు పాల్గొన్నారు.