అందరికీ అక్షరాస్యత అక్షరాస్యతతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విద్యా, సంప్రదాయాలు,సంస్కృతి ని కాపాడుకోవడం కోసం ఏకల్ విద్యాలయ అభియాన్ పనిచేస్తుందని , అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య విద్య ద్వారా ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, స్ర్తీ శిశు సంక్షేమానికి ఏకల్ విద్యాలయ అభియాన్ ద్వారా గొప్ప కార్యక్రమాలను చేపడుతున్నారని, దీనిని ప్రధాని మోదీ సైతం అభినందించారని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ అన్నారు.
ఆదివారం అదిలాబాద్ లోని గోపాల కృష్ణ మఠం లో చేపడుతున్న ఏకల్ విద్యాలయ అభియాన్ ఆచార్య ప్రాథమిక వర్గలో సాకటి దశరథ్ పాల్గొని తన సందేశాన్ని ఇచ్చారు. అట్లాగే ఏకల్ విద్యాలయ అభియాన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో శిక్షకులతో పాటు బోథ్ నియోజకవర్గం లోని వంద మంచి ఏకల్ అభియాన్ ఆచార్యులు పాల్గొన్నారు