ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్టు ఏ ఎన్ యం లా సమ్మె మూడవ రోజు కొనసాగుతుంది ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మోకాళ్ళ పైన నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ANM జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిగారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఆల్ ANM లందర్ని బేశరత్తుగా రెగ్యులర్ చేయాలాని నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి 11వ పిఆర్సి ప్రకారం వేతనం చెల్లించాలని 500 రూపాయలు వ్యాక్సిన్ అలవెన్స్2500 యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాలని ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని180 రోజుల వేతనంతో కూడిన మేటర్నటీ నుండి లీవులు మెడికల్ లీవులు ఇవ్వాలని వెంటనే ఏఎన్ఎం ల అందర్నీ సూపర్ న్యూమరి ఈ పోస్టులు క్రియేట్ చేసి రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో D లక్ష్మి T కవిత Aరేణుక జి రేణుక L రజనీత Ch దీవెన సిఐటియు జిల్లా అధ్యక్షులు కే చంద్రశేఖర్ జిల్లా నాయకులు కే సత్యం తదితరులు పాల్గొన్నారు