ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పశుమిత్ర యూనియన్ సిఐటియు కామరెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ధర్నా అనంతరం ఏవో గారికి జేడి గారికి పిడి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కే చంద్రశేఖర్ జిల్లా కన్వీనర్ కే రాజనర్సు జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2500 మంది పశు సంరక్షణ శాఖలో పనిచేస్తున్నారు గత ఎన్ని 8 సంవత్సరాల నుండి అత్యధికంగా మహిళలే ఉన్నారు వీరు ఐకెపి దారా ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పశు శాఖకు లో
పశుమిత్రులుగా నియమించారు వీరికి తన ఊరితోపాటు సబ్ సెంటర్ లో కూడా రైతులకు సంబంధించిన జంతువుల ఆరోగ్య సమస్యలను రాత్రనకా పగలనకా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ఆవులు బర్రెలు మేకలు, గొర్లు, కోళ్లు కుక్కలు జంతువులకు వైద్య పరమైన కృత్రిమ గర్భధారణ వ్యాక్సిన్ టీకలు వేయడం నట్టల మందు చేయడం శాస్టా చికిత్స లు చేయడం. గాలికుట్టి వ్యాధి. నీలినలుక వ్యాధి. పోచమ్మ వ్యాధి .దోబ్బ వ్యాధి .అనేక రకాల సేవలు . అందిస్తున్నారు వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వారితోషం లేకుండా పశుమిత్రులతో ప్రభుత్వం పెట్టి చాకిరి చేయించుకుంటుంది ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అత్యధికంగా మహిళా కార్మికులు ఉన్నందున వారికి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటి పారితోషకం లేకుండా వెట్టిచాకిరి చేయించుకుంటుంది ఇది సరైనది కాదు అని డిమాండ్ చేస్తున్నాం అలాగే గోపాల పశుమిత్ర వలె ఫిక్స్డ్ వేతనం 8500 ఇస్తున్న విధంగా పసుమిత్ర కార్మికులకు కూడా వర్తింపజేయాలని కోరుచున్నాము తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయి అనుకోని ఎన్నో ఆశలతో ట్రైనింగ్ తీసుకొని వీరి సేవ చేయడం చాలా అభినందనీయం కానీ వారికి ఎవరైతే రైతుల పశువులు ఉంటాయో వాళ్ల దగ్గరనే ఎంతో కొంత తీసుకొని సేవ చేయాలని అధికారులు చెప్పడం చాలా బాధాకరం వీరి పరిస్థితి అన్నమో రామచంద్ర అనే విధంగా ఉన్నది ఈరోజు ఏఓ గారిని అడిగితే జెడి గారిని అడగండి అని జెడి గారిని అడిగితే పిడి గారిని అడగండి సమస్యను దాటివేస్తున్నారు కావున వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలి
TA. DA. అలువెన్స్ ఇవ్వాలి
పాశుమిత్రులకు
జీవో 60 ప్రకారం వేతనాలు
ఇవ్వాలి
అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి
గోపాల పశుమిత్ర వారికి ఇచ్చిన విధంగా
పశు మిత్రులకు ఇవ్వాలి
పిఎఫ్ .ఈఎస్ఐ .కట్ చేయాలి పశుమిత్ర లకు ఐడెంట్ కార్డ్స్ ఇవ్వాలి పశుమిత్రుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నా కు కొత్త నర్సింలు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో పాశుమిత్ర నాయకులు. శ్రీలత. రజిని.రోజా. వినోద .సంధ్య. మమత.చంద్రకళ. తదితరులు పాల్గొన్నారు