కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
- డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్
మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:-
మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న బలరాం నాయక్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వివిధ గ్రామాల్లో తిరుగుతూ శుక్రవారం చిల్లంచర్ల, రాంపురం, ఆనేపురం, నీలి కుర్తి, భావోజిగూడెం, వెంకంపాడు, ఊకల్, గిరిపురం, తానంచర్ల, బురహాన్ పురం, గుండెపుడి గ్రామాలు తిరుగుతూ మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపే ధ్యేయంగా రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యంగా ఎండను కూడా లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల శ్రీ రంగారెడ్డి, యుగేంధర్ రెడ్డి, రఘువీరా రెడ్డి, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.