ప్రజల రాజు, స్త్రీల పక్షపాతి మరియు రిజర్వేషన్ల పితామహులు సాహు మహారాజ్ 149 వ జయంతి కార్యక్రమాన్ని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్నూలు నందలి బి క్యాంపులో గల మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి , దూదేకుల మాబ్బీ లు కలిసి సాహు మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ దళిత బహుజనులకు ప్రజాస్వామిక తాత్విక పునాది మీద సామాజిక న్యాయం ఏర్పరచి ప్రజల రాజుగా నిలిచిపోయిన మహనీయులు సాహు మహారాజ్ అని ఆమె అన్నారు. పితృస్వామ్య వ్యవస్థ వల్ల మరియు కుల,మత వ్యవస్థల వల్ల మహిళల పై జరుగుతున్న అమానుషాన్ని సాహు మహారాజ్ వ్యతిరేకించారు. సాహు మహారాజ్ తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను నేర్పించారు. అంతేకాక ఆమెకు సంగీతంలో, చిత్రలేఖనంలో, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇప్పించి ఆమె ద్వారా మహిళలకు బాలికలకు ఉపాధి రంగాలలో శిక్షణ ఇప్పించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి