సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపు
…………………………………….
భూమికోసం ,భుక్తికోసం ఎర్రజెండా నాయకత్వంలో పోరాడి అసువులు బాసిన ఇంద్రవెల్లి అమరులకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఘనమైన నివాళి అర్పించింది . ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ,భూమికోసం ,పెత్తందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో జరిగిన ఇంద్రవెల్లి పోరాటంలో పోలీస్ కాల్పుల్లో అసువులు బాసిన అమర వీరుల సాక్షిగా ఆదివాసులు ,పేదలు భూపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు .
అటవీ భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసీలకు ,ఇతర పేదలకు వెంటనే హక్కుపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము . కేంద్రప్రభుత్వం ఉట్నూర్ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు .ఇప్పటికి ఆదివాసులకు సరైన విద్య ,వైద్యం లభించడం లేదు అంటే పాలకులు సిగ్గుపడాలని దుయ్యబట్టారు.హక్కులు అడుగుతే రావు పోరాడితేనే వస్తాయి నీ ఇంద్రవెల్లి పోరాటం రుజువు చేసిందని అన్నారు .ఆదివాసులు ,పేదలు భూములకోసం పోరాడాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు అన్నమొల్ల కిరణ్ ,జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న ,ఆర్ .సురేందర్ ,పవర్ జితేందర్ పాల్గొన్నారు .
విప్లవాభివందనాలతో ….

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News