
ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం
మండలంలోని తమ్మడ పల్లి(ఐ) గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్డక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం మరియు గాలికుంటు నివారణ టీకాలు కార్యక్రమము నిర్వహించనైనది. ఈ శిబిరంలో ఉప్పుగల్ పశువైద్యాధికారి డా .కే.శ్రీనాథ్ 68పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేసి ఉచితముగా మందులు పంపిణీ చేయనైనధి.పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ వై.రాజేశ్వరరావు గోపాలమిత్రలు కే.లచ్చయ్య , సి.హెచ్.నగేశ్,జి. రాజు , ఎన్.రమణాచారి ఎండీ. అయస్,యం.రవీందర్, పశుమిత్ర స్వప్న గ్రామస్తులు పాడి రైతులు పాల్గొన్నారు.