అహ్మదీయ ముస్లిం జమాత్ ప్రతినిధుల బృందం సభ్యులు మౌల్వీ హమీదుల్లా హసన్,మౌల్వీ అక్బర్,మౌల్వీ జావేద్ అహ్మద్,మౌల్వీ ఆసిఫ్ అహ్మద్ ఖాదిం లు బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్,మెజిస్ట్రేట్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని అహ్మదీయ ముస్లిం జమాత్ సందేశాన్ని పరిచయం చేశామని వారు తెలిపారు.అనంతరం అహ్మదీయ జమాత్ 5వ ఖలీఫా మిర్జా మస్రూర్ అహ్మద్ ప్రంపంచంలోని వివిధ ఈవెంట్ లలో,పార్లమెంట్ సభలలో ఇచ్చిన సందేశముల క్రూడీకరణ గ్రంధం “ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గం”అనే గ్రంథాన్ని వారికి ప్రధానం చేశామని,అలాగే అహ్మదియ్య జమాత్ కు సంబందించిన పలు సమస్యలను నివేదించామని,కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిస్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ సందర్బంగా అహ్మదీయ మౌల్వీ హమీదుల్లాహ్ హసన్ తెలుగు గళం న్యూస్ తో మాట్లాడారు.అహ్మదీయ ముస్లిం జమాత్ ఇంటర్నేషనల్ నేటికి నూట ముప్పై సంవత్సరాకు పూర్వం నుండి యావత్ ప్రపంచ ధర్మాలను ఏకం చేసేందుకు కృషి చేస్తుందని,ప్రపంచ శాంతికి సర్వ ధర్మ ఐక్యత దోహద పడుతుందని అభిప్రాయ పడ్డారు.220 దేశాలకు పైగా దేశాలలో జమాత్ 5వ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ (అ.త.బి.అ)సారధ్యంలో అందరిని ప్రేమించు-ఎవ్వరిని ద్వేషించకు అనే నినాదంతో స్వచ్చమైన ధార్మిక ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు.