కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని,వెంటనే ఎన్కౌంటర్లను ఆపి మావోయిస్టులతో చర్చలు ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.గురవారం రోజు సిపిఎం జనగామ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన..దేశంలోని అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు నక్సలైట్ల పేరుతో ఆపరేషన్ కగార్ నిర్వహించడం,ఎన్కౌంటర్ల ద్వారా నరమేధం సృష్టించడం సరైంది కాదని మండిపడ్డారు.రాజ్యాంగం ప్రకారం నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టులో ఆధారాలు నిరూపించి శిక్ష విధించాలిగాని,అమానుష చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.పార్లమెంటు మెజారిటీ అంటే దేశాన్ని ఇష్టానుసారం నడపడానికి కాదని,గతంలో అలాంటి నియంతృత్వపు ప్రభుత్వాలు చరిత్రలో కలిసిపోయినట్లే నరేంద్ర మోడీ ప్రభుత్వానికీ అదే గతి ఎదురవుతుందని హెచ్చరించారు.దేశంలో నిరుద్యోగం,పేదరికం,ఆర్థిక అసమానతలు,దోపిడీ ఉన్నంతకాలం తిరుగుబాట్లు ఆగవని జాన్ వెస్లీ అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయాలని కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందన్నారు.గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ అభ్యర్థులను ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వెంటనే జమ చేయాలని,అవసరమైన ఎరువులు,విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని,రైతులకు తక్షణమే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సాంబరాజు యాదగిరి,రాపర్తి రాజు,బోట్ల శేఖర్,జోగు ప్రకాష్,పుత్కనూరి ఉపేందర్,బోడ నరేందర్,ఎండి అల్లారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌కౌంటర్లను ఆపాలి-మావోయిస్టులతో చర్చలు జరపాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని,వెంటనే ఎన్కౌంటర్లను ఆపి మావోయిస్టులతో చర్చలు…

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మరియు డిపిఆర్ఓ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి మైస ఎర్రన్న కళాబృందం ఆధ్వర్యంలో గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత…

మత్స్యకార సంఘం రాష్ట్ర 4వ మహాసభలు

మత్స్యకార సంఘం రాష్ట్ర 4వ మహాసభలు

కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఈ నెల 25,26 తేదీలలో జరగనున్న తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలన్న లక్ష్యంతో,స్టేషన్ ఘన్పూర్…

సీఎం సహాయ నిధి అందజేసిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

సీఎం సహాయ నిధి అందజేసిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట, గ్రామానికి చెందిన మామిండ్ల కొమురయ్య, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ క్రమంలో అతనికి సీఎం సహాయ నిధి…

తెలంగాణలో ‘ఇద్దరు పిల్లల నిబంధన’ రద్దు

తెలంగాణలో ‘ఇద్దరు పిల్లల నిబంధన’ రద్దు

తెలంగాణలో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హతకు ఆటంకం కానుంది. రెండు మందికంటే ఎక్కువ మంది…

సర్దార్ @150 యూనిటీ మార్చ్

సర్దార్ @150 యూనిటీ మార్చ్

దేశ ఏకత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని భూపాలపల్లిలో ‘సర్దార్ @150 యూనిటీ మార్చ్’ను ఘనంగా నిర్వహించారు.…

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

బుధవారం ఉదయం భూపాలపల్లి మండలం కొంపల్లి, గుడాడ్ పల్లి, నేరేడుపల్లి, గొర్లవీడు గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు.ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి…

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు

భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్…

విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం స్పష్టం

విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం స్పష్టం

జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం కొన్నాయిచలం వద్ద యాంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు జఫర్ గడ్ మరియు స్టేషన్ ఘనపూర్ మండలాల్లోని…