ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారి ఆత్మహత్యలను ఆపాలి.
ఆత్మహత్యాయత్నం చేసుకున్న డ్రైవర్ శంకర్ కు ప్రభుత్వమే వైద్య సదుపాయం అందించాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా కార్మికులు సమ్మె చేయడం జరుగుచున్నది. రెండవ రోజు సమ్మె సందర్భంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్చిన్నం చేయటం కొరకు రాష్ట్ర ప్రభుత్వం టెంపర్ వరి డ్రైవర్లను తీసుకువచ్చి బస్సులు నడిపించడం జరుగుచున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్చిన్నం చేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను నిరసిస్తూ నర్సంపేట బస్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ పరిస్థితిని తెలుసుకోవడం కోసం నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పటల్ ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డ్రైవర్ శంకర్ పరిస్థితి సుమారుగా 60/ 70% కాలిపోయి విషమించటంతో నర్సంపేట గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి ఎం జీ ఎం ఆసుపత్రికి పంపడం జరిగినది. డాక్టర్లు. శంకర్ ని రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతతో మెరుగైన వైద్య సౌకర్యం లు అందించాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి గమనించి వారి డిమాండ్స్ ను పరిష్కరించి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారూ