కుమ్మేర మల్లన్న జాతర ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలికుమ్మేర మల్లన్న జాతర ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం కల్పించాలి కుమ్మేర మల్లన్న స్వామి జాతర సందర్భంగా రజక సంఘానికి చెందిన భక్తులపై జరిగిన దాడి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, సమాజాన్ని కలిచివేసే విషాదకర సంఘటనగా ఆయన అభివర్ణించారు.భక్తి విశ్వాసాలతో దేవాలయ దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవమానించడం, వారిపై దాడి జరగడం మానవత్వానికి మచ్చగా నిలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు సామాజిక సమగ్రతకు భంగం కలిగిస్తాయని, శాంతి–సౌహార్ద వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఘటనపై బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మరియు వారికి పూర్తి రక్షణ కల్పించే వరకు తమ పార్టీ అండగా నిలుస్తుందని రవి పటేల్ తెలిపారు.అవసరమైన ఆర్థిక సహాయం, న్యాయ సహాయం అందించేందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధక చర్యలు చేపట్టాలని, దేవాలయ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయాలని అధికారులను కోరారు.సమాజంలో ఏ వర్గానికైనా అన్యాయం జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడటం తమ పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు.బాధితులకు న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికల ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి రజక తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *